అమరావతి: బాలికను పనిలో పెట్టుకుంటామని నమ్మించిన దంపతులు.. భార్య సహకారంతో సదరు బాలికపై భర్త పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వలేటివారిపాలెం మండలంలో ఓ దంపతులు కుటుంబ పోషణ బారం కావడంతో తన కూతురును పనిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సింగరాయకొండ మండలంలోని బాలిరెడ్డి నగర్కు చెందిన యుగంధర్-నాగమణి దంపతులకు సోఫాలు-కుర్చీల వ్యాపారం ఉండడంతో బాలికను ఢిల్లీకి తీసుకెళ్లారు. బాలికను పలుమార్లు బెదిరించి ఆమెపై యుగంధర్ అత్యాచారం చేశారు. భార్య సహాయంతోనే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వ్యాపార పనుల నిమిత్తం సింగరాయకొండ బాలిరెడ్డి నగర్కు యుగంధర్ వచ్చినప్పుడు బాలికను వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించాడు. అప్పుడప్పుడు బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. బాలిక శరీరంలో మార్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. బాలిక ఐదు నెలల గర్భవతి అని వైద్యులు తెలపడంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ హజరత్తయ్య కేసు నమోదు చేసి సిఐ విజయ్ కుమార్కు సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
భార్య సహకారంతో బాలికపై భర్త అఘాయిత్యం
- Advertisement -
- Advertisement -
- Advertisement -