Sunday, May 5, 2024

హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జంట జలాశయాలకు వరద నీరు కొనసాగుతోంది. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో మూడు వేల క్యూసెక్కులుగా ఉంది. నాలుగు గేట్ల ద్వారా మూసీకి 2750 క్యూసెక్కుల నీటిని కిందకు విడదల చేశారు. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1600 క్యూసెక్కులుగా ఉంది. నాలుగు గేట్ల ద్వారా మూసీకి 852 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. హుస్సేన్‌సాగర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌లో ఎఫ్‌టిఎల్‌ను నీటిమట్టం దాటింది. హుస్సేన్ సాగర్ ఔట్‌ఫ్లో 6500 క్యూసెక్కులుగా ఉంది.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News