Thursday, May 16, 2024

ఎల్లుండి నుంచి మెట్రో సేవలు

- Advertisement -
- Advertisement -

Hyderabad Metro services will resume on Monday

హైదరాబాద్: నగరంలో ఎల్లుండి నుంచి మెట్రో సేవలు ప్రారంభిస్తున్నామని మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి శనివారం ప్రకటించారు. సాధరణ ఉష్ణోగ్రతలు ఉంటేనే మెట్రోలో ప్రయాణించాలని ప్రజలను కోరారు. కోవిడ్-19 లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన మెట్రో సిబ్బందికి పిపిఇ కిట్లు అందజేస్తామని సూచించారు. స్మార్ట్ కార్డులు, నగదు రహిత విధానంతోనే టికెట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఎప్పకప్పుడు శానిటైజేషన్ చేయించడానికి తగిన జాగ్రత్తులు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు మెట్రో స్టేషన్లు, రైళ్లలో బౌతిక రూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మెట్రో స్టేషన్లలో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేయిస్తామని మెట్రో స్పష్టం చేశారు. మెట్రో ప్రారంభంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

Hyderabad Metro services will resume on Monday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News