హైదరాబాద్: నగరంలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా జిహెచ్ఎంసి అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించిన 24 గంటల్లోనే బేగంబజార్లోని ఉస్మాన్గంజ్ నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు ఆదివారం కూల్చివేశారు. నాలాపై అక్రమ నిర్మాణం చేపట్టడంతో వర్షాకాలంలో నీరు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని కార్పొరేటర్ శంకర్యాదవ్, స్థానికులు శనివారం నాలా పనులను పరిశీలించడానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్యాదవ్ దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
వెంటనే మంత్రి స్పందించి అక్రమ కట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. 70 సంవత్సరాలుగా తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి తలసానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Illegal building demolition by Minister Talasani orders