Tuesday, April 30, 2024

ఆర్‌బిఐ వేలంలో రూ. 500 కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

రూ. 25,750 కోట్ల రుణాలను సమీకరించనున్న 13 రాష్ట్రాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. నవంబరు 7వ తేదీన (మంగళవారం) రిజర్వుబ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. రూ.500 కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఇందు కోసం 13 ఏళ్ల కాలానికి రూ.500 కోట్ల చొప్పున రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది.

తెలంగాణతో పాటు మరో 12 రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ. 25,750 కోట్ల రుణాలను సమీకరించనున్నాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ- కుబేర్) విధానంలో ఈ వేలం నిర్వహించనున్నారు. రూ. 25,750 కోట్ల విలువైన రుణాలను అస్సాం, బీహార్, గోవా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక,మహారాష్ట్ర, పంజాబ్ , రాజస్థాన్, తమిళనాడు,ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పొందనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News