Saturday, May 11, 2024

జీవా ధోనికి భద్రత పెంపు

- Advertisement -
- Advertisement -

Increased security for Jeeva Dhoni

 

రాంచీ : ఎంఎస్ ధోని గారాల పట్టి జీవాపై కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్‌గా స్పందించిన జార్ఖండ్ ప్రభుత్వం శనివారం అప్రమత్తమైంది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని.. ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. దీంతో పాటు రాంచీలోని ధోని ఇంటి వద్ద జీవాకు రక్షణగా అదనపు భద్రతను కల్పిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని, బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్ చేజారిపోయిందంటూ సిఎస్‌కె ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు. ధోని, కేదార్ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. అయితే కొంతమంది మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతూ అసభ్యకర కామెంట్లు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News