Monday, April 29, 2024

ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 259/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జోరూట్ (142), బెయిర్‌స్టో (114)లు సెంచరీలతో కదం తొక్కడంతో స్టోక్స్ సేన 378 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. కేవలం మూడు వికెట్ల మాత్రమే కోల్పోయి రికార్డు విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 2-2తో సమం చేసింది. కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. పుజారా (66), పంత్ (57) మాత్రమే రాణించారు.

IND vs ENG 5th Test: ENG Won by 7 wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News