Tuesday, May 14, 2024

పుజారా ఔట్… భారత్ 279/5

- Advertisement -
- Advertisement -

India loss five wickets for 279 runs

 

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు భారత జట్టు 93 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 279 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఛటేశ్వరా పూజారా, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. మూడో వికెట్‌పై ఇద్దరు కలిసి 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పుజారా 77 పరుగులు చేసి హాజిల్ వుడ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. రిషబ్ పంత్ 97 పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో కమ్నీస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  కెప్టెన్ అజింక్య రహానే నాలుగు పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో మాథ్యూ వాడేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రవీచంద్రన్ అశ్విన్(06), హనుమాన్ విహారీ(04)  పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయాన్ కు రెండు వికెట్లు పడగా కమ్నీస్, హాజీల్ వుడ్ చెరో ఒక వికెట్ పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News