Saturday, April 27, 2024

పర్యావరణ నిర్వహణలో 180 దేశాల అట్టడుగున భారత్

- Advertisement -
- Advertisement -

India ranks lowest among 180 countries in EPI

టాప్‌లో డెన్మార్క్, బ్రిటన్ , ఫిన్లాండ్
భారత్‌లో ప్రమాదకరంగా తయారైన వాయు నాణ్యత
పర్యావరణ నిర్వహణ సూచిక ( ఇపిఐ) వెల్లడి

న్యూఢిల్లీ : పర్యావరణ నిర్వహణలో 180 దేశాల జాబితాలో అట్టడుగున భారత్ ఉన్నట్టు అమెరికాకు చెందిన అధ్యయన సంస్థలు వెల్లడించాయి. యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ కొలంబియా యూనివర్శిటీ వెలువరించిన 2022 పర్యావరణ నిర్వహణ సూచిక ( ఇపిఐ) లో డెన్మార్క్ టాప్‌లో ఉండగా, తరువాతి స్థానాల్లో బ్రిటన్, ఫిన్‌లాండ్ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా హరిత వాయు ఉద్గారాలను నిరోధించడం వల్లనే ఈ దేశాలు ఎక్కువ స్కోరు సాధించగలిగాయి. ప్రపంచం మొత్తం మీద వాతావరణ స్థితిపై డేటా ఆధారిత సారాంశాన్ని “ఇపిఐ” అందించింది. 11 అంశాల వారీగా 40 పనితీరు సూచికలను ఉపయోగించి వాతావరణ మార్పు, పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ జీవశక్తిలపై 180 దేశాల ర్యాంకులను నిర్దేశించింది. పర్యావరణ విధానపర లక్షాలకు ఆయా దేశాలు ఎంతవరకు చేరువలో ఉన్నాయో ఈ సూచిక తెలియచేస్తుంది. తక్కువ స్కోరులో ఉన్న దేశాల్లో భారత్ ( 18.9), మయన్మార్ (19.4), వియత్నాం ( 20.1 ) బంగ్లాదేశ్ ( 23.1 ),పాకిస్థాన్ ( 24.6 ) ర్యాంకుల్లో ఉన్నాయి.

ఏవైతే చాలా తక్కువ స్కోరు దేశాలో అవి ఆర్థిక సుస్థిరతకే ప్రాధాన్య మివ్వడం కానీ లేదా ప్రజాందోళనలతో అస్థిరత్వం, ఇతర సంక్షోభాలే కారణంగా కనిపిస్తున్నాయని నివేదిక వివరించింది. భారత్‌లో వాయు నాణ్యత ప్రమాదకరంగా తయారైందని, హరిత వాయు ఉద్గారాలు వేగంగా పెరుగుతున్నాయని, ఫలితంగా అట్టడుగు ర్యాంకుల్లోకి దిగజారిందని నివేదిక పేర్కొంది. ఇపిఐ లో 28. 4 స్కోరు సాధించిన చైనా 161 స్థానంలో నిలిచింది. కర్బన ఉద్గారాలను నియంత్రిస్తామని చైనా, భారత్ ఇటీవల హామీ ఇచ్చినప్పటికీ 2050 నాటికి ఈ రెండు దేశాలు రెండో భారీ ఉద్గారాల దేశాలుగా నిలుస్తాయని పరిశోధకులు ఆక్షేపించారు. సహచర దేశాల కన్నా వెనుకబడిన అమెరికా పశ్చిమ ప్రపంచ దేశాల్లోని 22 సంపన్నదేశాల్లో 20 వ స్థానంలోను, మొత్తం దేశాలన్నిటిలో 43 స్థానంలో నిలిచింది.

ట్రంప్ పాలనా కాలంలో పర్యావరణ అంచనాలను వెనక్కి తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అమెరికాను ఉద్దేశించి నివేదిక పేర్కొంది. డెన్మార్క్, బ్రిటన్, వంటి కొన్ని దేశాలు మాత్రమే 2050 నాటికి హరిత వాయువుల తటస్థీకరణ స్థాయికి చేరుకోవలసి ఉంటుంది. చాలా ఇతర దేశాలు తప్పుడు మార్గంలో ముందుకెళ్తున్నాయని, అందువల్లనే చైనా, భారత్, రష్యా దేశాల్లో హరిత వాయు ఉద్గారాల వెల్లువ పెరిగిపోతోందని నివేదిక హెచ్చరించింది. ఈ జాబితాలో రష్యా 112 స్థానంలో ఉంది. ప్రస్తుత పరిణామాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచం మొత్తం మీద వెలువడే హరిత వాయు ఉద్గారాల్లో సగానికి సగం అంటే 50 శాతం వరకు చైనా, భారత్, అమెరికా, రష్యా దేశాల నుంచే వెలువడే ప్రమాదం ఉందని ఇపిఐ నివేదిక హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News