Monday, April 29, 2024

దేశంలో కరోనా తగ్గుముఖం..

- Advertisement -
- Advertisement -

India records 67k fresh corona cases

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,084 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో 1,241మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.91కోట్లు దాటింది. ఇందులో 5,06,520 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 1,67,882 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడగా.. ఇప్పటివరకు 4,11,80,751మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,90,789 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతానికి తగ్గిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 171.28కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

India records 67k fresh corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News