Wednesday, May 1, 2024

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 422మంది మృతి

- Advertisement -
- Advertisement -

India report 40134 New Corona Cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్‌ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 422 మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.ఇక, దేశవ్యాప్తంగా కరోనాతో 4,24,773మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 36,946 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 3,08,57,467మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశంలో 47,22,23,639మందికి టీకాలు వేశామని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

India report 40134 New Corona Cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News