Wednesday, May 1, 2024

దేశంలో 8వేలకు పడిపోయిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Report 8k new corona cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల బాగా కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనాతో మరో 119 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4,29,24,130కి చేరాయి. దేశవ్యాప్తంగా కరోనాతో మరణించినవారి సంఖ్య 5,13,843కు చేరుకుంది. గత 24 గంటల్లో 16,765 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 4,23,07,686మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,02,601 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, క్రియావీల కేసుల రేటు 0.24 శాతానికి క్షీణించగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గింది. దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 177.50కోట్లు దాటినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

India Report 8k new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News