Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 2,58,089 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 258089 Covid-19 cases

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 2,58,089 కోవిడ్-19 కేసులు, 385 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,51,740 రికవరీలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 16,56,341 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ సానుకూలత రేటు 19శాతానికి చేరింది. నిన్నటితో పోలిస్తే 4శాతం కొత్త కేసులు తగ్గాయి. భారత్ లో ఇప్పటివరకు 8,209 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. 3,109 ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు కోలుకున్నారు. ఇండియాలో ఇప్పటివరకు 157.20 కోట్ల మందికి కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News