Saturday, May 4, 2024

దేశంలో కొత్తగా 2,858 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India Reports 2858 new corona cases

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దేశంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,858 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4.31కోట్లకు చేరాయి. గత 24 గంటల్లో 3,355 మంది వైరస్‌ నుంచి బయటపడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.25కోట్ల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,24,201 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 191కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India Reports 2858 new corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News