అహ్మదాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదోటీ20లో భారత్ 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు కెప్టెన్ కోహ్లీ(80 నాటౌట్; 52 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్ లు), రోహిత్ శర్మలు(64: 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లు)లు తొలి వికెట్ కు భారీ భాగస్వామ్యం అందించారు. ఇద్దరు భారీ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సూర్యకుమార్ యాదవ్(32; 17బంతుల్లోనే 3ఫోర్లు, 2సిక్స్ లు), హర్దిక్ పాండ్యా(39 నాటౌట్; 17బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్ లు) క్రీజులోకి వచ్చి రాగానే భారీ షాట్లతో చెలరేగాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 224 పరుగుల చేసింది.దీంతో ఇంగ్లండ్ జట్టుకు భారత్ 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ రషీద్, బెన్ స్టోక్స్ లు తలో వికెట్ తీశారు.
India set up 225 Runs target to England