Monday, April 29, 2024

భారత్ లక్ష్యం 231

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 102.1 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓలీ పోప్ భారీ సెంచరీ చెశాడు. పోప్ బ్యాటింగ్ లో అదరగొట్టాడు. ఓలీ పోప్ 196 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు ఓలీ పోప్(196), బెన్ డక్కెట్(47), టామ్ హార్ట్ లే(34), బెన్ ఫోక్స్(34), టాక్ క్లాలే(31), రెహాన్ అహ్మద్(28), జానీ బైస్ట్రో(10), జోయ్ రూట్(02), బెన్ స్టోక్స్(06), మార్క్ వుడ్(0) పరుగులు చేసి మైదానం వీడారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు, అక్షర పటేల్ ఒక వికెట్ తీశారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 246

భారత్ తొలి ఇన్నింగ్స్: 436

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 420

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News