Saturday, April 27, 2024

దక్షిణాఫ్రికా సిరీస్ కు భారత మహిళల జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

వచ్చే నెలలో దక్షిణాఫ్రికా జట్టుతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు భారత మహిళల జట్టును బిసిసిఐ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి అనంరతం మెల్లమెల్లగా అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల జట్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చె నెలలో టీమిండియా, దక్షిణాఫ్రికా మహిళల జట్లు తలపడనున్నాయి. మార్చి 7 నుంచి లఖన్ పూ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు వన్డేలు, మూడు టీ20ల మ్యాచులు జరగనున్నాయి. దీంతో వన్డే, టీ20ల సిరీస్ లకు భారత మహిళల జట్టును తాజాగా బిసిసిఐ ప్రకటించింది. వన్డే సిరీస్ కు మిథాలీ రాజ్, టీ20 సీరీస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ లు కెప్టెన్లుగా భాద్యతలు చెపట్టనున్నారు. వికెట్ కీపర్ శ్వేత వర్మ వన్డే సిరీస్ తో అరగేట్రం చేయనుంది.

వన్డే జట్టు: మిథాలీ రాజ్(కెప్టెన్), స్మృతి మంధాన, పూనమ్ రౌత్, జెమిమా, హర్మన్ కౌర్, ప్రియా పునియా, ఎస్తికా భాటియా, హేమలత, సుష్మా వర్మ(వికెట్ కీపర్), దీప్తి వర్మ, శ్వేత వర్మ(వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, జులన్ గోస్వామి, మున్సి జోషి, మోనిక పటేల్, ప్రత్యూష.

టీ20 జట్టు: హర్మన్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలి, సుష్మా వర్మ(వికెట్ కీపర్), రిచా ఘోష్, హర్లిన్, పర్వీన్(వికెట్ కీపర్), దీప్తి వర్మ, అయూషి సోని, అరుంధతి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మున్సి జోషి, మోనిక పటేల్, సిమ్రాన్, ప్రత్యూష.

India women’s team announces for South Africa Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News