Sunday, April 28, 2024

దేశీయ కంపెనీలు విదేశీ లిస్టింగ్ వెళ్లొచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు ఇప్పుడు విదేశీ ఎక్స్ఛేంజ్‌లలో కూడా లిస్ట్ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంతేకాదు దేశీయ కంపెనీలను అహ్మదాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (ఐఎఫ్‌ఎస్‌సి)లో లిస్ట్ చేయవచ్చు, దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముంబైలో కార్పొరేట్ బాండ్ల కోసం ఎఎంసి రెపో క్లియరింగ్ లిమిటెడ్ (ఎఆర్‌సిఎల్), కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్‌మెంట్ ఫండ్ (సిడిఎండిఎఫ్)ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

విదేశాల్లో కూడా స్వదేశీ కంపెనీలు తమ సెక్యూరిటీలను నేరుగా లిస్ట్ చేసుకోవచ్చని తెలిపారు. కంపెనీలు లిస్టెడ్ లేదా అన్‌లిస్టెడ్ కంపెనీలను నేరుగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఎక్స్ఛేంజ్‌లో పొందవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెద్ద ముందడుగు, కంపెనీలకు మెరుగైన విలువలతో మూలధనాన్ని సమీకరించేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు మే 2020లో కోవిడ్ మొదటి వేవ్ సమయంలో ప్యాకేజీని ప్రకటించినప్పుడు, దేశీయ కంపెనీలను విదేశీ మారకద్రవ్యాలలో జాబితా చేయడం ద్వారా మూలధనాన్ని సేకరించడానికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది.

అయితే ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించడానికి మూడేళ్లు సమయం పట్టింది. అంతకుముందు సెబీ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ దేశ క్యాపిటల్ మార్కెట్ ట్రెండ్ సెట్టర్‌గా అవతరించిందని, స్టాక్‌మార్కెట్‌లో సెటిల్ మెంట్ ఇప్పుడు వేగం పుంజుకుందని అన్నారు. 2013లో 2 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 నాటికి 11.4 కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. 10 ఏళ్ల క్రితం భారత్ స్టాక్‌మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74 లక్షల కోట్లు మాత్రమేనని, ప్రతి ఐదేళ్లకు రెట్టింపు పెరిగి ఇప్పుడు రూ.300 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News