- Advertisement -
గ్లాస్గో : స్కాట్లాండ్లో ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ సంతతి వారితో సోమవారం ముచ్చటించారు. వారు కూడా ప్రధానితో సందడిగా గడిపారు. ప్రపంచ స్థాయి వాతావరణ సదస్సుకు గ్లాస్గో ఆతిధ్యం ఇస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆదివారం రోమ్ నుంచి ఇక్కడికి వచ్చారు. సదస్సులో పాల్గొనడానికి ముందు ఆయన భారత రక్తసంబంధీకులతో ఆహ్లాదంగా గడిపారు. ప్రధానికి అభివాదాలు తెలిపిన భారతీయ సంతతివారు ఆయనకు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఆయన ప్రతిమను బహుకరించారు. ప్రజల మధ్య సంబంధాలను మరింత ఇనుమడింపచేసుకోవాలనే తపనతో ఇక్కడి భారతీయ సంతతి వారు ప్రధానిని కలిసినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమావేశం తరువాత ట్వీటు వెలువరించారు. ప్రధానిని కలిసిన 45 మంది ప్రవాస భారతీయ బృందంలో పలువురు డాక్టర్లు, విద్యావేత్తలు, వ్యాపారప్రముఖులు ఉన్నారు.
- Advertisement -