Monday, April 29, 2024

సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆటలు సాగనివ్వలేదు. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు పైరెట్లు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను భారత నేవీ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో సంచలనం సృష్టిస్తోంది. భారత నేవీ హెలికాప్టర్‌పై సముద్రపు దొంగలు తుపాకీతో దాడి చేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇది.

బంగ్లాదేశ్‌కు చెందిన బల్క్ క్యారియర్ ఎంవీ రాయెన్ ఓడను సోమాలియా సముద్రపు దొంగలు గత ఏడాది డిసెంబర్ 14న హైజాక్ చేశారు. ఆ షిప్ నుంచి తాజాగా భారత నేవీకి ఓ సందేశం వచ్చింది. హైజాక్ అయిన ఆ కార్గో షిప్‌ను గుర్తించిన భారత నేవీ మార్చి 15న ఓ చాపర్‌ను పంపించింది. ఆ చాపర్‌పై సముద్రపు దొంగలు దాడికి దిగారు. ఓ పైరేట్ ఓడ నుంచి కాల్పులు జరపడం వీడియోలో కనిపిస్తోంది.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆత్మరక్షణ కోసం సముద్రపు దొంగలను ఎదుర్కోవడం కోసం, వారిని నిర్వీర్యం చేయడం కోసం చాలా తక్కువ శక్తితో భారత నేవీ కాల్పులు జరిపింది. ఓడను విడిచిపెట్టాలని, బందీలుగా ఉన్న పౌరులను విడిచిపెట్టాలని భారత నేవీ సముద్రపు దొంగలను కోరింది. బంగ్లాదేశ్ జెండాతో ఉన్న కార్గోనౌకను ఇటీవల హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.

ఈ నౌక మంగళవారం హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తుండగా, సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణ లోకి తీసుకున్నారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశంపై మన నౌకాదళం స్పందించింది. ఈ నేపథ్యం లోనే తాజా సంఘటన వెలుగు లోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News