Monday, May 6, 2024

టిటిలో భారత్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

India's defeat at the Paralympic TT

టోక్యో: పారాలింపిక్స్ టిటిలో భారత్ ఓటమితో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోటీల్లో భారత ప్యాడర్లు భావినాబెన్ పటేల్, సోనాల్‌బెన్ మనుబాయి పటేల్ తొలి రౌండ్‌లలో పరాజయం చవిచూశారు. మహిళల క్లాస్3 విభాగంలో పోటీపడిన సోనాల్‌బెన్ పోరాడి ఓడింది. తొలి మూడు గేముల్లో సోనాల్ బెన్ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థి క్రీడాకారిణి లీ క్వాన్ విజృంభించి ఆడడంతో సోనాల్‌బెన్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత లీ 119, 311, 1715, 711, 411 తేడాతో సోనాల్‌బెన్‌ను ఓడించింది. ఇక మహిళల క్లాస్4 విభాగం మొదటి రౌండ్‌లో భావినాబెన్ కూడా ఓటమి చవిచూసింది. చైనాకే చెందిన ప్రపంచ నంబర్‌వన్ జౌయింగ్‌తో జరిగిన పోరులో భావినాబెన్‌కు చుక్కెదురైంది. ఆరంభం నుంచూ దూకుడుగా ఆడిన జౌయింగ్ 311, 911, 211 తేడాతో జయకేతనం ఎగుర వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News