Wednesday, May 1, 2024

తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తా

- Advertisement -
- Advertisement -

INLD Chief Om Prakash Chautala Comments on 3rd Front

చండీగఢ్: జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను కలుస్తానని ఐఎన్‌ఎల్‌డి అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా తెలిపారు. బిజెపి మిత్రపక్షమైన జెడి(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మధ్యాహ్న భోజన సమావేశం చేయాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళశారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని అంతం చేయడమే ప్రస్తుతం అతి ముఖ్యమైన అవసరమని అన్నారు. తన తండ్రి, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీ లోగా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను కలసి ఒకే వేదికపైకి రావాలని అర్థిస్తానని ఆయన చెప్పారు. అత్యంత బలమైన తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడమే తన ఆశయమని ఆయన చెప్పారు. టీచర్ల నియామకాల కుంభకోణంలో 10 ఏళ్ల జైలు శిక్షను అనుభవించి చౌతాలా ఇటీవలే విడుదలయ్యారు.

INLD Chief Om Prakash Chautala Comments on 3rd Front

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News