Wednesday, May 15, 2024

ఇది అమరవీరులను అవమానించడమే

- Advertisement -
- Advertisement -

జలియన్‌వాలా బాగ్ పునరుద్ధరణపై రాహుల్

‘Insult of martyrs’: Rahul Gandhi slams govt’s Jallianwala Bagh

న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది అమరవీరులను అవమానించడంగా ఆయన అభివర్ణించారు. వీరమరణానికి అర్థం తెలియని వ్యక్తే ఈ విధంగా అవమానించగలరని రాహుల్ దుయ్యబట్టారు. కొత్తగా తీర్చిదిద్దిన జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని గత శనివారం ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలను రాహుల్ తన ట్వీట్‌తో జతచేస్తూ తాను ఒక అమరవీరుడి కుమారుడినని, అమరవీరులకు అవమానం జరిగితే తాను ఎట్టి పరిస్థితులలో సహించబోనని పేర్కొన్నారు. ఈ అసభ్యకరమైన క్రూరత్వానికి తాము వ్యతిరేకులమంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని వారికి అందులో పాల్గొన్న వారి పట్ల ఏమాత్రం అవగాహన ఉండదంటూ మరో ట్వీట్‌లో రాహుల్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News