Saturday, May 4, 2024

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ కోసం టోల్ ఫ్రీ నెంబర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 9వ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం వి ద్యార్థులు 4,44,189 మంది ఉన్నారని అన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. మానసిక సమస్యలు, పరీక్షల ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇంటర్ బోర్డ్ ‘టెలీ మానస్’ పేరిట టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు ఏర్పాటు చేసింది. విద్యార్థులు మానసకింగా ఒత్తిడికి గురైనా, పరీక్షల సమయంలో ఇతర ఏ రకమైన మానసిక సమస్యలకు గురైనా 14416 లేదా 040- 24655027 నెంబర్లకు ఫోన్ చేసి చేసి అవసరమైన కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.
అమలులో నిమిషం నిబంధన
ఇంటర్మీడియేట్ పరీక్షలకు నిమిషం నిబంధన అమలులోకి ఉంది. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా సూచించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, పరీక్ష ప్రారంభమైన తర్వా త నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోని మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ప్రిటెండ్ మెటీరియల్స్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, సిబ్బందికి కూడా సెల్‌ఫోన్ అనుమతి ఉండదని అన్నారు. విద్యార్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News