Monday, April 29, 2024

బాలికల గురుకుల హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇమాంపేట బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్న వైష్ణవి అనే విద్యర్థిని వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటానాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన విద్యార్థినిని సూర్యాపేటలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన విద్యార్థిని వైష్ణవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News