Monday, April 29, 2024

మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : నాలుగు నెలలకు పైగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తాజాగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. మే 3న కుకీ, మొయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడడంతో ఇంటర్నెట్ సేవలను తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ శనివారం ప్రకటించారు.

రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు , విద్యాసంస్థలు , ఆరోగ్య సదుపాయాలు సహా వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీనిపై సమీక్షించిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటివరకు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 1118 మంది గాయపడ్డారు. సుమారు 33 మంది అదృశ్యమయ్యారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం లోని పరిస్థితులు కొంతమేర అదుపు లోకి వచ్చినట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News