Sunday, April 28, 2024

డివిలియర్స్ విధ్వంసం.. కోల్ కతా టార్గెట్ 195

- Advertisement -
- Advertisement -

IPL 2020: RCB Sets up 195 Runs against KKR

షార్జా: ఐపిఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి  194 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు ఓపెనర్స్ అరోన్‌ ఫించ్‌(47), దేవదత్‌ పడిక్కల్‌(32), కెప్టెన్ విరాట్ కోహ్లీ(33 నాటౌట్) రాణించారు. ఇక, ఎబి డివిలియర్స్(‌73 నాటౌట్‌) ధనాధన్ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. దీంతో బెంగళూరు జట్టు కోల్ కతాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్, ప్రసిద్ధ్ కృష్ణలు తలో వికెట్ తీశారు.

IPL 2020: RCB Sets up 195 Runs against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News