Friday, April 26, 2024

సౌదీ అరేబియాలో జగిత్యాల వాసి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రుద్రంగి: జగిత్యాల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి బొర్రయ్య(67) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో ప్రమాదవశాత్తు వర్క్‌షాపులో కింద పడడంతో తలకు గాయాలై చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బొర్రయ్య ట్రక్కు డ్రైవర్‌గా సౌదీలో పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం వర్క్‌షాపులో కాలుజారి కింద పడడంతో తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికి తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. బొర్రయ్య మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని స్వగ్రామం చేర్చుటకు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.

Jagtial’s man died in Saudi Arabia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News