Friday, April 26, 2024

జయశంకర్ సార్ సమాధి కబ్జా: వినయ్ భాస్కర్

- Advertisement -
- Advertisement -

Jayashankar sir samadhi occupied by BJP

 

వరంగల్: ప్రొఫెసర్ జయశంకర్ సార్ సమాధి స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. బిజెపి నేతలు కబ్జాకోరులకు మద్దతు పలుకుతున్నారని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పట్ల బిజెపి నేతల వైఖరి ఏంటీ అని ప్రశ్నించారు. జయశంకర్ సార్ విరాళం ఇచ్చిన స్థలంలోనే ఆయన సమాధి ఉందన్నారు. సమాధి స్థలాన్ని కబ్జా చేసి రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డారు. జయశంకర్ సార్ సమాధి ఉండాల్నా…. వద్దా…. బిజెపి నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు. దేవాదాయ శాఖ భూమి అయితే దానికి డబ్బులు చెల్లిస్తామన్నారు. స్థలం విషయంలో నిజనిర్థారణ కమిటీ వేస్తే అసలు విషయం తెలుస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News