Monday, May 6, 2024

జెఇఇ అడ్వాన్స్‌డ్ వాయిదా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. జులై 3వ తేదీన నిర్వహించాల్సిన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షను కరోనా ఉధృతి కారణంగా నిర్వహించలేకపోతున్నామని తెలిపింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత పరీక్ష నిర్వహణ తేదీని వెల్లడిస్తామని చెప్పింది. ఇక ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన జెఇఇ మెయిన్ పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలోనే మెయిన్ పరీక్షలను వాయిదా వేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది.

JEE Advanced 2021 postponed amid covid 19 Crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News