Saturday, April 27, 2024

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పరువునష్టం కేసులో ప్రముఖ తెలుగు సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ లకు నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో దాతల నుంచి ఉచితంగా రక్తాన్ని సేకరించి మార్కెట్లో అమ్ముకుంటున్నారని చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై జీవిత, రాజశేఖర్ దంపతులు అసత్య ఆరోపణలు చేశారంటూ నిర్మాత అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశారు.

దీంతో 12 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే.. జీవిత, రాజశేఖర్ దంపతులు జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News