Friday, April 26, 2024

జార్ఖండ్ జడ్జీది హత్యే: సిబిఐ

- Advertisement -
- Advertisement -

Jharkand judge killed

రాంచీ: జాగింగ్‌కు వెళ్లిన జార్ఖండ్ జడ్జీని కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) జార్ఖండ్ హైకోర్టుకు తెలిపింది. ఈ ప్రమాదానికి సబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధన్‌బాద్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ జులై 29 ఉదయం మెయిన్ రోడ్డుపై జాగింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఓ ఆటో వెనుక నుంచి వచ్చి ఆయన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న ఆయనని ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ జడ్జీ ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ విషయమై దర్యాప్తు చేసిన సిబిఐ అది హత్యేనని, కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి గుజరాత్‌కు చెందిన గాంధీనగర్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో విచారణ జరిపి తగిన ఆధారాలు సేకరించినట్లు పేర్కొంది. ఈ కేసు విచారణ తుది దశలో ఉందని, ఫోరెన్సిక్ నివేదికలు పొందాక విచారణ పూర్తవుతుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News