Monday, April 29, 2024

ఎంపి కోమటిరెడ్డిని కలిసిన జిట్టా బాలకృష్ణారెడ్డి..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంపి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం జిట్టా బాలకృష్ణారెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతులన్న నేపధ్యంలో గత రెండు రోజుల క్రితం ఆయన రేవంత్‌తో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకోగా తాజాగా ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ కావడం మరింత ప్రాదాన్యత సంతరించుకోవడం విశేషం.అయితే, జిట్టా సొంత నియోజక వర్గం భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లపై భరోసా లభించిన నేపధ్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఈ నెల 17న తుక్కుగూడలో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభ సందర్భంగా కాంగ్రెస్‌లో అధికారికంగా చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్రతి పార్లమెంటు స్థానంలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన నేపధ్యంలో భువనగిరి సీటు బీసీలకు ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా తెలంగాణ ఉద్యమ నేత, భువనగిరిలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన నాయకుడు రావడంతో పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోని గెలిచే నాయకుడిని కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉంచి విజయం సాధించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే జిట్టా కోసం కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. దీంతో నెల 17న హైదరాబాద్ లో జరిగే సభలో సోనియా గాంధీ సమక్షంలో జిట్టా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: బెంగళూరును బీట్ చేస్తున్నాం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News