చెన్నై: ఇటీవల ‘ఇండియన్ 2’ సినిమా సెట్లో జరిగిన ప్రమాదం కేసు విచారణలో భాగంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విలక్షణ నటుడు, తమిళ అగ్ర కథానాయుకుడు కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ నెల 19న రాత్రి చెన్నై శివారులోని ఈవిపి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భారీ క్రేన్ కుప్పకూలడంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉన్న కమల్ హాసన్, హీరోయిన్ కాజల్, డైరెక్టర్ శంకర్ లు త్రుటిలో తప్పించుకున్నారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న వారిని విచారణ కోసం స్టేషన్ కు పిలిపించి ప్రమాదానికి గల కారణాలు, షూటింగ్ కోసం ఉపయోగించిన క్రేన్ విషయంలో ఎలాంటి భద్రతా జాగ్రత్తలను తీసుకున్నారని పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను కూడా మంగళవారం పోలీసులు విచారించారు.
Kamal Haasan appear before Central Crime Branch police