Sunday, May 5, 2024

రెండో స్థానానికి పడిపోయిన కింగ్ కోహ్లీ..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయాడు. తాజా టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని మంగళవారం ఐసిసి విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో కింగ్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం అర్థ శతకం కూడా చేయలేకపోయాడు. దీంతో 906 పాయింట్ల నుండి 20 పాయింట్లు కోల్పోయిన కోహ్లీ ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక, మూడో స్థానంలో ఆసీస్ ఆటగాడు లంబుషేన్(827), నాలుగో స్థానంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(813), ఐదో స్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ బాబర్ అజమ్(800)లు ఉన్నారు. టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె, పుజారాలు కోహ్లీతోపాటు టాప్ టెన్ లో నిలిచారు. బౌలింగ్ జాబితాలో భారత్ నుంచి స్పీడ్ స్టన్ జస్ప్రీత్ బుమ్రా ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్, రెండో స్థానంలో కివీస్ బౌలర్ వాంగర్ లు ఉన్నారు.

Kohli retains 2nd spot after fail in New Zealand Tour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News