Tuesday, April 30, 2024

రజనీ సాయం కోరుతాను: కమల్‌హాసన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: మాజీ ఐఎఎస్ అధికారి సంతోష్‌బాబు మంగళవారం కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్‌నీది మయ్యం(ఎంఎన్‌ఎం)లో చేరారు. సంతోష్‌బాబుకు పార్టీ సభ్యత్వం ఇచ్చిన కమల్ ఆయణ్ని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సంతోష్‌బాబు పార్టీ ఐటి విభాగం, విధాన నిర్ణయాలు, ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలాంటి పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తారని కమల్‌హాసన్ తెలిపారు. 25 ఏళ్లపాటు ఐఎఎస్ అధికారిగా పని చేసిన సంతోష్‌బాబు ఈ ఏడాది ఆగస్టులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సంతోష్‌బాబు 2018-19 కాలంలో తమిళనాడులోని ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో ఐటి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడులు వచ్చాయని తెలిపారు. అయితే, వారి పేర్లు, ఏవిధమైన ఒత్తిడులన్నది బాబు వెల్లడించలేదు. రాజకీయ నాయకత్వంలో మార్పు వచ్చినపుడే ప్రభుత్వశాఖల్లో అవినీతి తొలగిపోతుందని కమల్‌హాసన్ అన్నారు. అది త్వరలోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల విషయంలో రజనీకాంత్ మద్దతు కోరుతానని కమల్‌హాసన్ తెలిపారు. కూటమి ఏర్పాటుపై ప్రశ్నించగా, సరైన సమయంలో దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Kamal Haasan seeks help from Rajinikanth

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News