Friday, April 26, 2024

సృజనాత్మకతను వెలికితీసే వేదిక కావాలి కళాభారతి

- Advertisement -
- Advertisement -

అన్ని రంగాల్లో కామారెడ్డి అభివృద్ధి: వేముల ప్రశాంత్ రెడ్డి

KamaReddy more developed in TRS Rule

కామారెడ్డి : ఆర్ అండ్ బి మంత్రిగా తాను సైతం ఆశ్చర్యపోయే విధంగా కామారెడ్డి పట్టణంలో అర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం చేశారని  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కళాభారతి ఆడిటోరియం భవనాన్ని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… కామారెడ్డి ప్రజలకు గంప గోవర్ధన్ లాంటి నాయకులు దొరకడం అదృష్టమన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన తరువాత జిల్లాకు ఎన్ని కొత్త కొత్త కట్టడాలు రావాలో అన్ని తీసుకువస్తున్నామన్నారు. కామారెడ్డి పట్టణ సుందరీకరణ పాటుపడుతున్న వ్యక్తి గంప గోవర్ధన్ అని కొనియాడారు.

ప్రభుత్వ కార్యాలయాలు మొక్కుబడిగా కాకుండా తాను దగ్గరుండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కట్టిస్తున్నారని ప్రశంసించారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు గంప గోవర్ధన్ కు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇంత గొప్ప కళాభారతి ఆడిటోరియంను తన చేతులు మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సృజనాత్మకతకు కళా భారతి వేదిక కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

కామారెడ్డి పట్టణంలో ఇంత మంచి ఆడిటోరియం నిర్మాణానికి నిధులు కేటాయించి సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ మంత్రి కెటిఆర్ లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News