Monday, May 6, 2024

3 అంగుళాల ద్రాక్షతో రూ.లక్షల్లో సంపాదన..

- Advertisement -
- Advertisement -

వీఎస్ డి అనే కొత్త రకం ద్రాక్షకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ ద్రాక్షను తినేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రకం ద్రాక్షను పండిస్తున్న రైతులు రూ.లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. తాజాగా కర్ణాటక బెళగావికి చెందిన సచిన్ శివప్ప అనే రైతు.. మహారాష్ట్ర నుంచి వీఎస్ డీ రకం ద్రాక్ష విత్తనాలు తీసుకొచ్చి పెంచుతున్నాడు.

మూడు అంగుళాల పొడువు ఉండే ఈ ద్రాక్షకు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉండడంతో భారీగా లాభాలు వస్తున్నాయంటున్నాడు శివప్ప. పైగా ఈ రకం ద్రాక్షను పండించేందుకు ఖర్చు కూడా తక్కువే అవుతుందంట. పెద్దగా తెగుళ్లు కూడా రాదని చెబుతున్నాడు. దీంతో శివప్ప పండించే ద్రాక్షను చూసేందుకు ఇతర రైతులు.. ఆయన పొలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News