- Advertisement -
బెంగళూరు:లాక్ డౌన్ సమయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రవాణాపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజారవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు, వాహనాల్ని నడిపే అంశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే తుది నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. అలాగే, రాష్ట్ర పరిధిలో అన్ని రైళ్లు నడుస్తాయని సిఎం యడ్యూరప్ప తెలిపారు. ఇక, బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని సిఎం యడ్యూరప్ప స్పష్టం చేశారు.
Karnataka Govt green signal to RTC Bus Services
- Advertisement -