Saturday, May 4, 2024

నా ఫస్ట్… రెమ్యూనరేషన్ అదే

- Advertisement -
- Advertisement -

Keerthy Suresh Denies Rumours About jayalalitha Biopic

హీరోయిన్ కీర్తి సురేష్ ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోల సరసన కూడా నటిస్తోంది. అయితే ఈ భామ నేనుశైలజ, నేనులోకల్, మహానటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో కీర్తి కొద్దికాలంలోనే తెలుగు కుర్రకారును ఫిదా చేసేసింది. ఇంతవరకు సినిమాల్లో ఎలాంటి స్కిన్ షో గాని గ్లామర్ రోల్స్ జోలికి వెళ్లకుండానే కీర్తి అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం ఈ వయ్యారి చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ నితిన్ సరసన ‘పవర్ పేట’ సినిమాలతో పాటు ‘గుడ్ లక్ సఖి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ఉంది.

తాజాగా అమ్మడు తాను తీసుకున్నటువంటి ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి తెలియజేసింది. కీర్తి మాట్లాడుతూ.. తాను ఎప్పుడైనా ఏది సంపాదించినా తన తండ్రి చేతికే ఇచ్చేదాన్ని. నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌ను నేరుగా మా నాన్న చేతిలో పెడతాను.. అయితే నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసేటప్పుడు ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. అప్పుడు వారు 500/రూపాయలు ఇచ్చారు. నాకు తెలిసి నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ అదే. ఇక్కడ విషయం ఏంటంటే ఆ 500 కూడా తీసుకెళ్లి మా నాన్నకే ఇచ్చేసాను అని చెప్పింది. ప్రస్తుతం అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘అన్నాతే’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News