Saturday, April 27, 2024

ఇడి కస్టడీలో నుంచి రెండో సారి కేజ్రీ ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

ఉచిత మందుల కొరత ఉండరాదని ఉత్తర్వు
మొహల్లా క్లినిక్‌లపై ప్రత్యేకంగా హితవు
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీలో నుంచి రెండవ సారి ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లలో ప్రజలకు మందులు, పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని కేజ్రీవాల్ ఆదేశించినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భారద్వాజ్ మంగళవారం వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో అందుబాటులో ఉన్న లేబరేటరీ పరీక్షలలో సమస్యల గురించి కేజ్రీవాల్‌కు సమాచారం అందిందని, అందుకే ఆయన ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారని భారద్వాజ్ విలేకరుల గోష్ఠిలో చెప్పారు.

ఆ సమస్యల పరిష్కారానికి ఆరోగ్య శాఖ వెంటనే పూనుకుంటుందని ఆయన తెలియజేశారు. కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల సంక్షేమం గురించి కేజ్రీవాల్ సదా ఆలోచిస్తుంటారనేందుకు ఆయన తాజా ఆదేశాలు నిదర్శనమని భారద్వాజ్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ నెల 28 వరకు ఇడి కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) కన్వీనర్ కేజ్రీవాల్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరా, మురుగునీటి సమస్యలను పరిష్కరించవలసిందని జల వనరుల శాఖ మంత్రి ఆతిశీకి క్రితం వారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు ఇడికి, కస్టడీ కాలంలో కేజ్రీవాల్‌కు జారీ చేసిన ఉత్తర్వుకు అనుగుణంగా తాజాగా జారీ చేస్తున్న ఆదేశాలు ఉన్నదీ లేనిదీ ఇడి పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News