Saturday, May 18, 2024

శ్రీకాంత్‌కు ఘన సత్కారం

- Advertisement -
- Advertisement -

Kidambi Srikanth was felicitated

 

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ను మంగళవారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పెద్ద సంఖ్యంలో గోపిచంద్ అకాడమీకి చేరుకున్న అభిమానులు శ్రీకాంత్‌ను అభినందించారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తికనబరిచారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా శ్రీకాంత్‌ను సత్కరించారు. శ్రీకాంత్ గెలుపు దేశానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News