Thursday, May 9, 2024

క్లైమాక్స్‌లోని పాయింట్‌కి కనెక్ట్ అవుతారు

- Advertisement -
- Advertisement -

Kiran Abbavaram about Sammathame Movie

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ “యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘సమ్మతమే’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు గోపీనాథ్ రెడ్డి. ప్రతి సీన్ చాలా వినోదాత్మకంగా వుంటుంది. రెండున్నర గంటలపాటు ఒక ఫ్రెష్‌నెస్ ఉంటుంది ఈ సినిమాలో. ఇందులో కథానాయకుడి పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది. అందుకే చిన్నప్పుడే ‘నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు’ అని నాన్నని అడుగుతాడు హీరో. పెళ్లిపై అంత శుభసంకల్పం వున్న హీరో క్యారెక్టర్‌కి తన పెళ్లి చూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైంది? ఒక మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపథ్యం వున్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా వుంటుంది? అనే అంశాలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి ఈ సినిమాలో. పాటలు కూడా అద్భుతంగా వుంటాయి. శేఖర్ చంద్ర మంచి ఆల్బం ఇచ్చారు. ఒక అమ్మాయి తాలూకు ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ప్రేమలో పడినపుడు, రిలేషన్‌షిప్‌లో వున్నపుడు ఇలా ప్రతి ఎమోషన్‌ని కొత్తగా చూపించాం. అలాగే ఒక మధ్యతరగతి తండ్రి, కొడుకు… తల్లి, కొడుకు మధ్య అనుబంధం చాలా ఎమోషనల్‌గా వుంటుంది. ముఖ్యంగా ‘సమ్మతమే’ క్లైమాక్స్ అద్భుతంగా వుంటుంది. క్లైమాక్స్‌లో చెప్పే పాయింట్‌కి అందరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం. నా తదుపరి చిత్రాల్లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ఆగస్ట్‌లో రిలీజ్ ఉంటుంది. సెప్టెంబర్ చివరలో ‘వినరో భాగ్యం విష్ణు కథ’ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సినిమా వుంటుంది. ఈ ఏడాదిలోనే ఈ మూడు సినిమాలు విడుదలవుతాయి”అని అన్నారు.

Kiran Abbavaram about Sammathame Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News