Friday, May 10, 2024

సిద్దిపేట ఘటనపై నివేదిక ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

Kishan Reddy directed DGP to file report on Siddipet incident

 

డిజిపికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట ఘటనపై నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డికి మంగళవారం నాడు ఆదేశాలిచ్చారు. సిద్ధిపేటలో జరిగిన సోదాలపై నివేదిక ఇవ్వాలని, బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియజేయాలని డిజిపిని ఆదేశించారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు జరిగాయన్న ఆరోపణలున్నాయని, సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు తనికీలు చేపట్టారన్న అంశాలపై పూర్తి నివేదిక కోరారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి బండి సంజయ్ అరెస్టు వరకు జరిగిన పరిణామాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని కిషన్ రెడ్డి డిజిపికి ఆదేశించారు. అయితే దీనిపై సమాధానం ఇచ్చేందుకు పోలీస్ శాఖ సైతం సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News