Tuesday, May 14, 2024

ఓడిన జట్టుకు మంచి ఏమీ ఉంటుంది: రాహుల్

- Advertisement -
- Advertisement -

KL Rahul reaction on PBKS Defeat

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలు కావడంతో ఆ జట్టు కెప్టెన్ కె ఎల్ రాహుల్ స్పందించాడు. ఓటమి పాలైన జట్టు చెడు, మంచి లాంటి ఉండవన్నారు. తమ బ్యాటింగ్ తీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. మంచి జట్టు మైదానంలో ఉన్నప్పుడు తొందరగా అర్థం చేసుకొని నిర్ణయాలు చేస్తుండడంతో ఆ జట్టే విజయం సాధిస్తుందన్నారు. జాంటీ రోడ్స్ కోచింగ్ తో తమ జట్టు ఫీల్డింగ్ మెరుగుపడిందన్నారు. బిష్ణోయ్ ఒక స్టన్నింగ్ క్యాచ్‌తో తమ ఫీల్డింగ్ ఎలా ఉందో చెప్పొచ్చన్నారు. జాంటీ రోడ్స్ వల్లే ఈ విధమైన క్యాచ్‌లు పడుతున్నామన్నారు. పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 124 పరుగుల లక్ష్యాన్ని కెకెఆర్ ముందు ఉంచింది. కెకెఆర్ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెకెఆర్ విజయంలో కెప్టెన్ మోర్గాన్(47), త్రిపాఠి(41) కీలక పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News