Friday, May 17, 2024

అన్న ప్రాణం తీసిన చెల్లి ప్రేమ వివాహం….

- Advertisement -
- Advertisement -

చెన్నై: సోదరి ప్రేమ వివాహం ఓ ఇంజనీరు హత్యకు గురైన సంఘటన తమిళనాడులోని లాల్గుడి ప్రాంతం తిరుమంగళంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కృపన్ రాజు(27) చెన్నైలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కృపన్ రాజుకు సంవత్సరం క్రితం రాబిన్ సామేరితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక మగ బిడ్డ కూడా ఉన్నాడు. కృపన్ రాజ్ సోదరి గిరిజ ఉంది. ఆమె మరో యువకుడు కవియరసన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో గిరిజకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. గిరిజ-కవియరసన్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. గిరిజ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కృపన్ రాజ్ బైక్‌పై కవియరసన్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా అతడిని ఇద్దరు సోదరులు పట్టుకున్నారు. కృపన్ రాజ్‌తో కవియరసన్, అతడి సోదరుడు వాగ్వాదానికి దిగారు. కృపన్‌రాజ్‌పై కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో ఉన్న కృపన్ రాజ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృపన్‌రాజ్ కన్నుమూశాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కవియరసన్, అతడి సోదరుడు కలైవానన్ సమయపురం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News