Friday, April 26, 2024

రూ. 11 కోట్ల విరాళాలు సేకరిస్తాం

- Advertisement -
- Advertisement -

ముంబై: కొవిడ్ బాధితుల సహాయార్ధం కోసం రూ.11 కోట్లను విరాళంగా సేకరించాలని నిర్ణయించినట్టు విరాట్ కోహ్లి దంపతులు పేర్కొన్నారు. తొలుత తాము రూ.7 కోట్లను మాత్రమే సేకరించాలని భావించినా తమ అభ్యర్థనకు స్పందించి పలువురు దాతలు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తుందడంతో దాని టార్గెట్ రూ.11 కోట్లకు పెంచినట్టు వివరించారు. ఇప్పటికే తమ వద్ద రూ. ఏడు కోట్ల రూపాయలు జమ అయ్యాయని పేర్కొన్నారు. త్వరలోనే రూ. 11 కోట్లను సేకరించి కొవిడ్ బాధితుల సాయం కోసం వెచ్చిస్తామని వెల్లడించారు. ఇక తమ అభ్యర్థనను మన్నించి పెద్ద మొత్తంలో విరాళాలు అం దించేందుకు ముందుకు వచ్చిన ఎంపిల్ స్పోర్ట్ ఫౌండేషన్‌కు విరుష్క దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపిల్ ఫౌండేషన్ కొవిడ్ బాధితుల కోసం రూ.ఐదు కోట్లను విరాళంగా ప్రకటించింది.

Kohli and Anushka raise target Rs 11 Cr for Covid relief fund

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News