Saturday, April 27, 2024

కవ్వింపులే ఆ కసిని పెంచాయి: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ల కవ్వింపులే తమలో గెలవాలనే కసిని రేకెత్తించిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గెలుస్తామని ముందు భావించలేదన్నాడు. అయితే, అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న మ్యాచ్‌ను ఇంగ్లండ్ ఆటగాళ్ల అతి.. కొత్త దిశగా తీసుకెళ్లిందన్నాడు. వారు తమపై కవ్వింపులకు దిగడంతో వాటికి ఆటతోనే సమాధానం చెప్పాలని నిర్ణయించామన్నాడు. ఇందులో తాము సఫలం కావడం గర్వంగా ఉందన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 272 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టును భారత బౌలర్లు కేవలం 120 పరుగులకే పరిమితం చేశారు. దీంతో ఈ సిరీస్ లో భారత్ సంచలన విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Kohli reacts to Lord’s win against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News