Tuesday, May 7, 2024

నల్లగొండలో కెటిఆర్ కు ఘన స్వాగతం…

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు నల్గొండకు చేరుకున్నారు. స్థానిక ఎంఎల్ఎ కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ బైపాస్ నుంచి 2 వేల బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించి, కెటిఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. నల్లగొండ గులాబీ మయంగా మారింది. నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మరి కొద్దిసేపట్లో నల్గొండ టౌన్ లో పాలిటెక్నిక్ కాలేజీ లో నిర్మించిన ఎస్ సి, ఎస్ టి హాస్టల్స్ భవనాలను కెటిఆర్ ప్రారంభించనున్నారు. 110 కోట్లతో నిర్మిస్తున్న ఐటి హబ్ కు మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా రెండున్నర లక్షల స్క్వర్ ఫీట్ లో 110 కోట్లతో ఐటి హబ్ ను ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News