Tuesday, April 30, 2024

బిజెపి నాయకులకు కౌంటర్ ఇచ్చిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR recounter to BJP leaders

హైదరాబాద్: ఏడాదిపాటు చలిలో, కోవిడ్ వల్ల వీధుల్లో చనిపోయిన వేలాది మంది వదిలేసిన వాళ్లు దేశ భక్తులుగా ఉన్నారని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరైతే వాళ్లకు చేయూత హస్తం అందించారో వారు వంచకులుగా మారారని కెటిఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇదే విచిత్రమైన లాజిక్ అని అన్నారు. ఈ విషయంలో దేశ భక్తి సర్టిఫికేషన్ ఇవ్వడానికి వీరు ఎవరూ అని ప్రశ్నించారు. సాగు చట్టాలు రద్దు చేయాలని రైతుల ఆందోళన చేసిన సందర్భంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సిఎం కెసిఆర్ పరిహారం ప్రకటించారు. దీంతో సిఎం కెసిఆర్‌ను వంచకుడు అని తెలంగాణ బిజెపి నాయకులు మండిపడడంపై కెటిఆర్ రీ కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News